ఊహాగానాలకు స్పందించను ... రాజీనామాపై జైపాల్ రెడ్డి

Jaipal Reddy Clarification On Resignation, Jaipal Reddy Clarifies Resignation Issue, Resignation S.Jaipal Reddy

 

కేంద్ర శాస్త్రం సాంకేతిక శాఖ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి  కేంద్రం మే నెలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై అనుకూల నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేస్తారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ శ్రేణులను ప్రశ్నించగా అది వారి వ్యక్తిగత అంశమని పిసిసి ప్రధాన కార్యదర్శి, జైపాల్ బంధువు ఉద్దేమర్రి నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. జైపాల్ రెడ్డిని రాజీనామా విషయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణాపై కేంద్రమంత్రిగా నేను ఏమీ మాట్లాడను, రాజీనామా చేస్తున్నానన్న ఊహాగానాలకు నేను స్పందించను అన్నారు.