చార్మినార్ నిజాం జాగీర్ కాదు: జగ్గారెడ్డి

 

 

Jagga Reddy fire on MIM, Jagga Reddy congress,  Jagga Reddy telangana

 

ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ అసేంబ్లీ, చార్మినార్, ఎర్రకోట, తాజ్ మహల్ ల గురించి, అసేంబ్లీలో మహాత్మాగాంధీ విగ్రహం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పై జగ్గారెడ్డి మండిపడ్డారు. చార్మినార్, అసెంబ్లీ, తాజ్ మహల్, ఎర్రకోట మావే అని చెప్పేందుకు అది మజ్లిస్, రజాకార్ల జాగీర్ కాదని, అవి పూర్తిగా ప్రజల సొమ్ముతో కట్టినవని అన్నారు. మరో సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పాషాఖాద్రీ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్రం కోసం కృషిచేసిన మహాత్మగాంధీ గురించి మాట్లాడిన అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను అందరూ ఖండించాలని, ఇకముందు ఇలాగే మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.