టైటానియం కుంభకోణంలో జగన్ కు వాటా!
posted on Apr 4, 2014 11:26AM
టైటానియం కుంభకోణం కేసులో కేవీపీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా సంబంధం వుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపి౦చారు. డబ్బుల కోసం అంతర్జాతీయ క్రిమినల్స్ తో చేతులు కలిపి దేశం పరువు తీశారని మండిపడ్డారు. బెయిల్ కోసం వెయ్యి కోట్లు చెల్లించిన వ్యక్తులతో బేరసారాలు చేసారని అన్నారు. క్రిమినల్స్తో కలిసి ప్రపంచమంతా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారని, ఆ డబ్బు తెచ్చి ఇక్కడ ఓటుకు రూ. వెయ్యి, రెండు వేలు పంచి పెడుతున్నారని, లక్ష కోట్లు సంపాదించి ఎన్నికల్లో ఐదు, పది వేల కోట్లు ఖర్చు చేయడం వీరికి ఒక లెక్క కాదని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని కాపాడతారా లేక అమ్మేస్తారా అని ప్రశ్నించారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదని, ప్రజల సొమ్మును దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టామని హెచ్చరించారు.