జగన్ తో టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు 5 కోట్ల డీల్!

 

 

jagan tdp mlc, TDP MLC Boddu Jagan, TDP MLC Boddu ysrcongress

 

 

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు జగన్ పార్టీలో కి చేరుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నుచంచల్‌గూడ జైల్లో కలిశాడు. భాస్కర రామారావు వెంట కాకినాడ నగర శాసనసభ్యుడు, కాంగ్రెస్ నుంచి జగన్ పంచన చేరిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.


మరోవైపు భాస్కరరామారావుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారంటూ, జగన్ తో ఐదు కోట్ల డీల్ జరిగిందని ఆరోపిస్తున్నారని ఒక ప్రముఖ పత్రిక వెబ్ సైట్ లో కధనాన్ని ప్రచురించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.8 కోట్లు ఖర్చు అయిందని, ఆ డబ్బు కోసమే భాస్కరరామారావు పార్టీని ఫిరాయించారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.