భయపడుతున్న జగన్ పార్టీ !

 

 

jagan jail, jagan ysr congress, jagan assets case, ysr congress cooperative elections

 

 

సహకార ఎన్నికల్లో సత్తా చూపలేకపోయిన జగన్ పార్టీ తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. విద్యావంతులు, మేధావులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నందున తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించడం లేదని ప్రకటించింది. రాష్ట్రంలో మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. దీనిని బట్టి ఆ పార్టీ భయపడుతున్నట్లు కనిపిస్తుంది. వైఎస్ పట్ల కిందిస్థాయి వర్గాల్లో సానుభూతి ఉంది. అయితే విద్యావంతులు, మేధావుల వరకు వచ్చే సరికి జగన్ అవినీతి చర్చకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దిగి రిస్కు తీసుకోవడ౦ ఎందుకు అని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.