అన్నీ నార్మలే... బరువు కూడా తగ్గలేదు

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్... గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడోరోజుకి చేరింది, అయితే జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు... కొంచెం నీరసంగా ఉన్నారని తెలిపారు, బ్లడ్ ప్లెజర్, షుగర్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయన్న వైద్యులు... బరువు కూడా తగ్గలేదన్నారు, అయితే జగన్ దీక్ష శనివారం వరకూ కొనసాగితే ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుందని హెల్త్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మరోవైపు జగన్ దీక్షకు పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు.