జగన్ తలపెట్టింది ‘అసుర దీక్ష’

 

వైసీపీ అధినేత జగన్ మళ్ళీ దీక్షల బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతున్న అమరావతి ప్రాంతంలో వున్న మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో ‘సమర దీక్ష’ పేరుతో ఆయన దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని మరింత చికాకు పెట్టాలన్నది జగన్ ఆలోచన. అయితే ఈ దీక్షను ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు ‘అసుర దీక్ష’గా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని భారీగా దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న జగన్ త్వరలో మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం అని కిషోర్ బాబు విమర్శించారు. జగన్ ఇలాంటి దీక్షలు ఎన్ని చేసినా ప్రయోజనం వుండదని ఆయన అన్నారు.