జగన్మోహన్ రెడ్డికి గంటా సవాల్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్న జగన్... రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు, జగన్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే డెవలప్ మెంట్ కు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు, భోగాపురంలో తనకు భూములున్నాయంటూ జగన్ చేసిన విమర్శలను ఖండించిన గంటా.... అక్కడ తనకు ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ హయాంలో 117 కంపెనీలకు భూములిస్తే తప్పులేదు గానీ, రాష్ట్రాభివృద్ధి కోసం భూములు సేకరిస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని గంటా మండిపడ్డారు.