తెరాస ఎంపీ వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు..!!

 

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసం, వ్యాపార సంస్థల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.. హైదరాబాద్‌లో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.. ఖమ్మం నగరంలోని ఎంపీ నివాసంలో ఉదయం 9 గంటల నుంచి సోదాలు చేపట్టారు.. అదే విధంగా బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ సోదాలపై ఎంపీ పొంగులేటి స్పందించారు.. ఇవి సాధారణ సోదాలేనని స్పష్టం చేశారు.. అయితే ఇప్పుడు ఈ సోదాలు తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారాయి.. తెరాస పార్టీకి చెందిన ఎంపీ ఇంట్లో సోదాలు జరగడం ఏంటి అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.