భారత్ లో మొట్టమొదటి జపాన్ వాహన తయారీ సంస్థ

 

భారత్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరుజిల్లాలో జపాన్ తన మొట్టమొదటి వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ స్థాపించనుంది చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ఆర్థిక మండలిలో రూ.1500 కోట్లతో తేలికరకం వాణిజ్య వాహనాలు ట్రక్కులు, వ్యాన్ల వంటి తయారీ పరిశ్రమను స్థాపించనుంది.  శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు అవగాహనా ఒప్పందం (ఎం.వో.యూ)కుదుర్చుకుంది. ఇసుజు మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు షిగేరు వకబయాషి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి జపాన్ రాయబారి తోకేషి యాగీ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీసిటీ ప్రతినిథులు రవి సన్నారెడ్డి, శ్రీనిరాజు హాజరయ్యారు.శ్రీసిటీలో 110 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పరిశ్రమకోసం విద్యుత్తు, వ్యాట్ తో బాటు ఇతర రాయితీలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం తన సంసిద్ధతను తెలియజేసింది.