వారిద్దరు ఇంకా ఐ.యస్. ఉగ్రవాదుల చెరలోనే!

 

ఐదు రోజుల క్రితం లిబియాలో ఐ.యస్.ఐ.యస్.ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన హైదరాబాద్ కి చెందిన బలరాం కిషన్, గోపీ కృష్ణ ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తాజా సమాచారం. వారిని విడిపించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతవారం 29వ తేదీన వారు హైదరాబాద్ తిరిగి వస్తుండగా సిర్సత్ పట్టణం సమీపంలో కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాప్ అయిన నలుగురిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం విడిచిపెట్టారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలికి చెందిన టి. గోపీకృష్ణని, హైదరాబాద్ కి చెందిన బలారంకిషన్ న్ని ఇంతవరకు విడిచిపెట్టలేదు.

 

గత వారం రోజులుగా వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వాల తరపున మంత్రులు వారికి దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిరువురూ ఈ రోజు విడుదలవవచ్చని విదేశాంగ శాఖ అధికారులు ఆశిస్తున్నారు. కానీ ఉగ్రవాదుల చెరలో విడుదలయ్యే వరకు ఎవరూ కూడా ఖచ్చితంగా హామీ ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంది.