వేధింపులు తాళలేక.. దేశాన్నే విడిచి వెళ్లిపోయింది..

ఆడవాళ్లకు ఎక్కడున్నా లైంగిక వేధింపులు ఉంటాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అవి మాత్రం కామన్ అయిపోయాయి. మన దేశంలోనే కాదు ఎక్కడికి వెళ్లినా ఆడవాళ్లపై అరాచకాలు మాత్రం ఆగవు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ లైంగిక వేధింపులు తాళలేక దేశమే విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. షీనా షిరాని అనే ఆమె ఇరాక్ దేశంలోని ప్రెస్ టీవీ అనే ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేసేది. అయితే ఆ ఛానల్ డైరెక్టర్, తన బాస్ హమీద్ రజా ఇమాదీ ఆమెను లైంగికంగా వేధించేవారు అంటూ.. తనకు పంపిన మెసేజ్ లు, వాయిస్ మెయిల్స్ ను, ఫోన్ రికార్డింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాదు పలు సంస్థలు, ప్రజలు ఆమెకు మద్దతు పలుకుతుండటమే కాకుండా.. టీవీ ఛానల్ సదరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసింది.