తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు జీఓ జారీ

 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం జీవో నెంబర్ 21ని విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ వుండగా, ఆ పరీక్షలను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగానే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. జీవో జారీతో వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే రాయనున్నారు.