వరుస వికెట్లు సమర్పించుకుంటున్న టీమిండియా... 415/7

 

భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదటి రోజు తన సత్తా చాటింది. పూజారా, కోహ్లీ చేరో సెంచరీ చేసి భారీ స్కోర్ అందించారు. అయితే రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. కాస్త తడబడినట్టే కనిపిస్తోంది. కేవలం 12 పరుగుల వ్యవధిలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత 101 ఓవర్ మూడో బంతికి  విరాట్ పెవిలియన్ చేరగా, ఆ తరువాత సాహా, జడేజాలు అవుటయ్యారు. లంచ్ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 415 రన్స్ చేసింది.