రెండో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా సెంచ‌రీల మోత...

 

విశాఖలో భారత్-ఇంగ్లడ్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే రెండు వికెట్లు కోల్పొయింది. అయితే పుజారా, కోహ్లి మాత్రం టీమిండియాను ఆదుకున్నారు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో  సెంచ‌రీల మోత మోగించారు. చాలా జాగ్రత్తగా ఆడుతూ... ఇంగ్లండ్ బౌలర్లతో ఆడుకుంటున్నారు. కాగా టెస్టుల్లో పుజారా ప‌దో సెంచ‌రీ బాద‌గా.. కోహ్లి 14వ సెంచ‌రీ చేశాడు.