లంచ్ సమయానికి భారత్ స్కోర్ 411..

 

రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  నాలుగవ రోజు భోజ‌న విరామ స‌మ‌యానికి భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 411 ప‌రుగులు చేసింది. సాహా 29, అశ్విన్ 29 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇవాళ ఉద‌యం ఈ ఇద్ద‌రూ ఏడో వికెట్‌కు 50 ర‌న్స్ జోడించారు. అంత‌క‌ముందు ర‌హానే, కోహ్లీ వికెట్ల‌ను టీమిండియా కోల్పోయింది. 40 ప‌రుగులు చేసిన కోహ్లీ హిట్ వికెట్ రూపంలో నిష్క్ర‌మించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే భార‌త్ మ‌రో 126 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. కాగా మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 537 పరుగులకు  చేసి భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచింది.