జాగ్రత్తగా ఆడుతున్న టీమిండియా..

 


భారత్-ఇంగ్లండ్ ల మధ్య తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 537 పరుగులకు  చేసి భారీ లక్ష్యాన్ని ఇండియా ముందు ఉంచింది. ఇక నిన్న బ్యాటింగ్ కు దిగిన టీమిండియా చాలా జాగ్రత్తగా వికెట్లు కోల్పోకుండా ఆడుతుంది. ఈ రోజు బ్యాటింగ్‌ ప్రాంరంభించిన భారత్‌.. 47 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోయి 156 పరుగులు చేసింది. ఓపెనర్‌ విజయ్‌(55 బ్యాటింగ్‌), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌(ఛటేశ్వర పూజారా(58 బ్యాటింగ్‌) అర్థ శతకాలు సాధించి జట్టుకు భారీస్కోరు అందించే దిశగా పయనిస్తున్నారు. ఓపెనర్‌ గంభీర్‌ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రాడ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా ఫాలో ఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 181 పరుగులు చేయాల్సి ఉంది.