టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా

 

ఈ రోజు మొదలవనున్న ఆసియా టి20 కప్ లో భాగంగా మొదటిమ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్, ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పిచ్ పచ్చికతో ఉన్న కారణంగా, బౌలింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. అందుకే టాస్ గెలవగానే, బంగ్లా మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. పుణేలో గ్రీన్ పిచ్ మీద టీం ఇండియా తడబాటు చూసి బంగ్లాదేశ్ ఈ ప్లాన్ వేసింది. బంగ్లాదేశ్ లోని మీరపూర్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. గ్రీన్ పిచ్ కావడంతో 140 డిఫెండబుల్ స్కోర్ గా కనిపిస్తోంది. ప్రాక్టీస్ లో గాయపడ్డ ధోనీ, ఈ మ్యాచ్ లో బరిలో దిగుతున్నాడు.