25 వేల మంది సుర‌క్షిత స్థానాల‌కు..

 

భార‌త్‌, పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. పాక్ రేంజర్లు తరచూ భారత సరిహద్దులోని ప్రజలపై దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నెల‌రోజులుగా ఇదే ప‌రిస్థితి నెల‌కొనడంతో దాదాపు 25 వేల మంది స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు సొంత ఇళ్ళను వీడి సుర‌క్షిత స్థానాల‌కు వెళ్లారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు పది మంది జవాన్లు, 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 20 మందికిపైగా గాయాల‌పాలై చికిత్స పొందుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని దాదాపు 167 గ్రామాలకు చెందిన ప్ర‌జ‌లు త‌మ ప్రాంతాల‌ను వీడారు.