343 బిలియన్ డాలర్ల బాలల వ్యభిచారం

 

ఇటీవల నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి దేశంలో బాలల వ్యభిచారానికి సంబంధించిన చేదు వాస్తవాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో చిన్నారులతో జరుగుతున్న వ్యభిచారం 343 బిలియన్ డాలర్ల వ్యాపారంగా కైలాష్ సత్యార్థి చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి అపహరించిన అమ్మాయిలతో ఈ తరహా వ్యభిచారం నిరాఘాటంగా సాగుతోందని సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. సత్యార్థి నేతృత్వంలోని గ్లోబల్ మార్చ్ అగెయినెస్ట్ చైల్డ్ లేబర్ పైన ఓ అధ్యయనం చేసింది. భారతదేశంలో బాలలతో చేయిస్తున్న ఈ తరహా వ్యభిచారం తరతరాలుగా కొనసాగుతోందని ‘ఎకానమిక్స్ బిహైండ్ ఫోర్స్ డ్ లేబర్ ట్రాఫికింగ్’ పేరిట విడుదలైన ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో 32 లక్షల మంది చిన్నారులు బలవంతంగా వ్యభిచార కూపంలో కొనసాగుతున్నట్టు తేలింది.