ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక
posted on Mar 26, 2013 8:52AM
ఈనెల 20వ తేదీన నాంపల్లి సిబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉస్మానియా వైద్యాధికారులను కోరింది. ఉస్మానియా వైద్యుల బోర్డు శ్రీలక్ష్మికి ఈనెల 30వ తేదీన అపాయింట్ మెంట్ ఇచ్చింది. జైలు అధికారులు సిబీఐ కోర్టు 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని వైద్యుల బోర్డుకు తెలుపగా వైద్యాధికారుల బోర్డు సోమవారమే నివేదిక ఇచ్చేందుకు సిద్దమై శ్రీలక్ష్మి ఆరోగ్య సమస్యలను అడిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య పరీక్షలు చేసి, ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని, కనీసం లేచి నిలబడే స్థితిలో కూడా లేరని, ఆమె ఎడమకాలు ఎముక జాయింట్ల వద్ద తీవ్రంగా నొప్పి ఉందని ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి చంచల్ గూడ జైలు అధికారులకు అందచేసినట్లు తెలిసింది. జైలు అధికారులు శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదికను సిబీఐ కోర్టుకు సాయంత్రం సమర్పించింది. ఈ అంశంలో శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక పై మంగళవారం సిబీఐ కోర్టు తదుపరి ఆజ్ఞలు జారీ చేసే అవకాశం వుంది.