హైదరాబాద్ పై విజయమ్మ స్పందన

 

 

 

ప్రజలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందో చెప్పాలని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. జగన్ కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆమె ఆరోపించారు. విభజనపై కాంగ్రెస్ నేతలు ఒక్కక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విజయమ్మ వ్యాఖ్యానించారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆమె అంటున్నారు.

 

హైదరాబాద్ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని విజయమ్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్దికే రాజశేఖరరెడ్డి పాటు పడ్డారని ఆమె అన్నారు. అయితే హైదరాబాద్ కు సంబందించి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇంత బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.