షాదనగర్ రేప్ కేసు.. కాసేపట్లో మీడియా ముందుకు నిందితులు

 

ప్రియాంకా రెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులు అందరూ దొరికారు. మరికాసేపట్లో వారందరిని మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు సైబరాబాద్ పోలీసులు. నిందితులు వాడిన లారీని కూడా ట్రేస్ చేశారు పోలీసులు. ట్రేస్ చేసిన లారీని గుర్తించి.. పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళు వాడిన లారీ శ్రీనివాస్ రెడ్డి అనే పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ పాషాతో పాటు చెన్నకేశవరెడ్డి, జోళ్ల శివా, నవీన్ లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

ఘటనకు పాల్పడిన తరవాత ప్రియాంకా రెడ్డిని ఓ దుప్పట్లో చుట్టి అదే లారీలో షాద్ నగర్ కు తీసుకెళ్లారు దుండగులు. అక్కడ ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. అత్యంత దారుణంగా దాదాపు 70 శాతం ప్రియాంకా రెడ్డి కాలిపోయింది. మొత్తం నలుగురు లారీ డ్రైవర్లు ఈ అఘాయిత్యానికి చేశారు. ఆమెను కొట్టి, హింసించి ఈ దారుణానికి పాల్పడ్డారు. నలుగురి నిందితుల్లో ప్రధాన నిందితుడైన మహ్మద్ భాషా ఫోటో మాత్రమే ప్రస్తుతానికి బయటకు వచ్చింది.