ఈటెల సభకి తేనెటీగల హాజరు

 

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంప్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న సభపై తేనెటీగలు దాడిచేశాయి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం సభ నిర్వహిస్తూ వుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. తేనెటీగల దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ బ్రహ్మయ్యకు పోలీసులు గోడలా ఏర్పడి రక్షణ కల్పించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.