సీఎంకు అస్వస్థత..

 

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి నుంచి ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఆయనను సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరభద్రసింగ్ వయసు 82 సంవత్సరాలు. కాగా 2012 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు 1983 నుంచి 1990 వరకు, 1993 నుంచి 1998 వరకు, 2003 నుంచి 2007 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన... తాజాగా 2012 నుంచి కూడా సీఎంగా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు.