లోయలో పడ్డ బస్పు..14మంది మృతి

 

హిమాచల్ ప్రదేశ్లో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌ మండి జిల్లాకు స‌మీపంలోని జార్జ్ ప్రాంతం మీదుగా వెళుతోన్న ఓ బ‌స్సు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి లోయలో పడింది. ఈ ప్ర‌మాదంలో బ‌స్సులోని ప్ర‌యాణికుల్లో 14 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఘట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ బ‌స్సులో చిక్కుకుపోయిన ప్ర‌యాణికుల‌ను ర‌క్షించేందుకు శ్ర‌మిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది అధికారులు తెలుపుతున్నారు.