అమరావతిలో హైటెన్షన్.. డ్రోన్ కెమెరాలతో నిఘా.. రైతుల ఆందోళన!!

రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ, రాజధాని తరలింపుకు ఒప్పుకోబోమని.. రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.  రోజురోజుకి ఆ ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈరోజు మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమి ఆర్ధిక నేరగాళ్లం కాదని, అరాచకం సృష్టించే వాళ్ళం కాదని ఎందుకు డ్రోన్ లతో చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చేసుకుంది. దీంతో మందడంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.