తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

 

తెలంగాణలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరపకుండా తెరాస ప్రభుత్వం పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది.ఆగస్టు 1వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించటాన్ని సవాలు చేస్తూ వెంకటేష్ అనే న్యాయవాది హైకోర్టు ను ఆశ్రయించారు.ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యంగ విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ మూడు నెలల వరకు పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను పాలన ఉంటుందని తెలిపింది.ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరని, వివిధ కారణాలతో వాటిని వాయిదా వేయడం మంచి పద్ధతి కాదని హైకోర్టు అభిప్రాయపడింది.అనంతరం ఎన్నికల నిర్వాహణకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడం, ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంపై న్యాయస్థానం తప్పుబట్టింది.