హైకోర్టును వెంటనే విభజించండి... టీ ఎంపీలు

 

తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును విభజించాలని పిటిషన్ ను దాఖలు చేయగా ఇప్పుడే విభజించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంటనే ప్లకార్డులు పట్టుకొని హైకోర్టును వెంటనే విభజించాలని నిరసనలు తెలిపారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు మాట్లాడుతూ హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, కోర్టు విభజన చేయాలని తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.