హీరో రామ్‌చరణ్ 10 లక్షల సాయం

 

హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజల సమస్యలను తీర్చడానికి, సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం సోమవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. అలాగే మంగళవారం సినీ కథానాయకుడు రామ్‌చరణ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.అలాగే మందులు, క్లోరినేషన్ మందులు కూడా పంపిణీ చేస్తామని, అపోలో ఫౌండేషన్ ద్వారా ఈ సహకారం అందుతుందని చెప్పారు. నిత్యావసర సరకులను కూడా పంపిణీ చేయనున్నామని రామ్‌చరణ్ తెలిపారు. తుఫాను సహాయ చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నాయని రామ్‌చరణ్ ప్రశంసించారు.