భారీ వర్షాలకు 12 మంది మృతి

 

Heavy rains lash AP, More heavy rain forecast in AP

 

 

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 12 మంది మృతి చెందారని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి రఘువీర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందన్నారు. వర్షాల వల్ల మృతి చెందిన కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా, ఆపద్భందు పథకం కింద రూ.50 వేల నగదును ప్రకటించారు.


భారీ వర్షాలకు 294 చెరువులు దెబ్బతిన్నాయన్నారు. ఇంకా 884 గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసి 53 పునరావాస కేంద్రాల్లో 8,360 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు.

 

ఈ ఏడాది రాష్ట్రంలో 29 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. 13 జిల్లాలో అధిక, 8 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, విశాఖ, అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.