ప్రేమ పేరుతో వేధింపులు.. నిర్భయ కేసు నమోదు

 

జగిత్యాలలో రవి అనే డిగ్రీ విద్యార్థి సిమ్రాన్ బేగం అనే యువతిని ప్రేమపేరుతో వేధిస్తూ వుండటంతో ఆ యువతి ఈ వేధింపులు తట్టుకోలేక ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సిమ్రాన్ బేగం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవి మీద నిర్భయ కేసు నమోదు చేశారు. రవి చాలాకాలంగా సిమ్రాన్‌ని ప్రేమ, పెళ్ళి పేరుతో వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక సిమ్రాన్ కాలేజీకి వెళ్ళడం కూడా మానేసింది. దాంతో రవి సిమ్రాన్ ఇంటి పక్కనే వుండే తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులను ఆమె దగ్గరకి ప్రేమ రాయబారానికి పంపించాడు. దానిని సిమ్రాన్ ఇంట్లోని పెద్దలు గమనించడంతో పెద్ద గొడవ జరిగింది. ఈ అవమానం తట్టుకోలేక సిమ్రాన్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.