హనుమంతప్పకు కడసారి వీడ్కోలు..

జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్ప నిన్న మరణించిన సంగతి తెలిసింది. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. కాగా ఈరోజు ఆయన స్వగ్రామమైన ధార్వాడ్ జిల్లా బెటదూరు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. దీనిలో భాగంగా పోలీసులు తుపాకులు గాల్లో పేల్చి గౌరవ వందనం సమర్పించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీ చేపట్టి హనుమంతప్పకు కడసారి వీడ్కోలు తెలిపారు.