తిరుమలలో ఏం జరిగిందో చెప్పండి: గవర్నర్

 

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఎప్పుడు ఏం జరిగిందో మొత్తం తనకు నివేదిక ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ టీటీడీ అధికారులను కోరారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పరస్పరం ఫ్లెక్సీలు చించుకుని, పోలీసు స్టేషన్ వద్ద ధర్నాలు చేయడం, అలాగే తిరుమలలో కూడా జగన్ అనుచరులు హల్ చల్ చేయడం లాంటి సంగతులు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులను గవర్నర్ నివేదిక కోరినట్లు సమాచారం.