కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కేసీఆర్..!!

 

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి.. ముఖ్యంగా తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నాయి.. తాజాగా గులాంనబీ అజాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరాస పాత్ర ఏమిలేదని, తెరాస కాంగ్రెస్ పార్టీని మోసం చేసిందని విమర్శించారు.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోరాడటంతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని స్పష్టం చేసారు.. తమ ఎంపీలు అధికార పార్టీలో ఉండి కూడా రాష్ట్రం కోసం పోరాటం చేశారని, ఇందులో తెరాస పాత్ర శూన్యమన్నారు.. తెరాస హైదరాబాద్, ఢిల్లీలో ప్రకటనలు చేయడం తప్ప చేసేందేమీ లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్లే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, ఈ నాలుగేళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే భర్తీ చేయలేకపోయారని, ఇంకా కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని ఎద్దేవా చేశారు.. విద్యార్థులు, యువతను కేసీఆర్ మోసం చేశారని, ముస్లింల రిజర్వేషన్ల అంశంలోనూ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు.. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి తమనూ మోసం చేశారని తెలిపారు.. పార్లమెంటులో మోదీ సర్కారుకు మద్దతిస్తున్న కేసీఆర్‌, రాష్ట్రంలో మాత్రం తిడుతూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని అజాద్ మండిపడ్డారు.