బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఉదయం పార్లమెంట్‌లో 2015 - 16 సంవత్సరాలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతితో ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అరుణ్ జైట్లీ నిల్చునే బడ్జెట్ ప్రసంగాన్ని చేస్తున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. మంత్రివర్గం ముందు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలను ఉంచారు. మంత్రివర్గం ఆ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.