బస్సులో మంటలు.. ఐదుగురి మృతి

 

తమిళనాడులో అనూహ్యమైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బస్సులోనే సజీవ దహనమవ్వగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రామనాథపురం సమీపంలోని కీల్ళకరై సమీపంలో ఓ ప్రైవేట్ బస్సులో గ్యాస్ సిలెండర్ పేలడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. దాంతో ఐదుగురు వ్యక్తులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. కాలిన గాయాలకు గురైన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. మృతులు, గాయపడినవారు అందరూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు యాత్రికులను తీసుకొచ్చిన ప్రైవేట్ బస్సు ఇది. రామేశ్వరం ఆలయాన్ని సందర్శించిన అనంతరం కన్యాకుమారికి వెళ్తూ వుండగా దారిలో ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు వంట కోసం వినియోగించే గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది.