ఢిల్లీలో సిలెండర్ పేలుడు.. ఆరుగురు మృతి

 

ఢిల్లీలో ఘోర సంఘటన జరిగింది. ఢిల్లీలోని జసోలా ప్రాంతంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలడంతో ఆరుగురు తీవ్ర గాయాలపాలై మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా వున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో గ్యాస్ సిలెండర్ల పేలుళ్ళు తరచుగా  జరుగుతున్నాయి. వారం రోజుల క్రితమే ఇలాంటి ఒక సంఘటన ఢిల్లీలోనే జరిగింది. అయితే ఆ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు. గ్యాస్ పెద్ద గ్యాస్ సిలెండర్‌లో వున్న గ్యాస్‌ని చిన్న గ్యాస్ సిలెండర్లలోకి మార్చుతుండగా ఈ ప్రమాదం జరిగి వుండొచ్చని అనుమానిస్తున్నారు.