టిడిపిలో చేరిన గల్లా అరుణ, జయదేవ్

 

 

 

కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వీరిరువురు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా గల్లా అరుణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న తమను, ఆపార్టీ నట్టేట ముంచిందని అన్నారు.సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని గల్లా అరుణ మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమన్నారు. అందుకే తాము టిడిపిలో చేరుతున్నామన్నారు. చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సహకరించేందుకే పార్టీలో చేరుతున్నానని చెప్పారు. జయదేవ్ మాట్లాడుతూ.. తనకు నటుడు మహేష్ బాబు, ఆయన తండ్రి కృష్ణల మద్దతు ఉందని చెప్పారు. మహేష్ బాబు ఏ పార్టీకి చెందని వాడయినప్పటికీ తనకు మద్దతిస్తారని చెప్పారు.