గల్లా వెంటపడిన ఎమ్మార్ భూతం

 

ఎమ్మార్ భూమూలా వ్యవహారంలో ఇంతవరకు చాలా మంది నేతలు, అధికారులు కేసులలో ఇర్రుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు తాజాగా తెదేపా కండువా కప్పుకొన్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి వంతు వచ్చింది. ఆమె కూడా ఎమ్మార్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలయిన ఒక ప్రవేట్ పిటిషన్నువిచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు, ఈ వ్యవహారంలో ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఆమెపై ఇటువంటి ఆరోపణలేవీ రాలేదు. కానీ చిత్రంగా ఆమె పార్టీ వీడగానే ఆమెపై పిటిషను పడింది. అది కూడా మామూలు కోర్టులో గాక సీబీఐ కోర్టులో పడింది. బహుశః ఆమె రాజకీయ ప్రత్యర్ధులు రాజకీయ కారణాలతోనే సరిగ్గా ఎన్నికల సమయం చూసుకొని ఆమెపై ఈ పిటిషను వేసి ఉండవచ్చును. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎన్నికలలో గెలవడం కష్టమని భావించిన ఆమె తెదేపాలోకి మారితే, ఇప్పుడు ఈ సరికొత్త ఆరోపణలు ఆమెకు ఇబ్బందికరంగా మారనున్నాయి.