గాలి వారి పెళ్లిపై దాడికి ఐటీ శాఖ సిద్దం..

 

గాలి జనార్ధన రెడ్డి కుమార్తె వివాహం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు గాలి జనార్థన్ రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఐటీ శాఖకు పిర్యాదు అందినట్టు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ టి.నరసింహమూర్తి ఈ పెళ్లి ఖర్చులకు సంబంధించి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం నాలుగు పేజీల ఫిర్యాదులో గాలి జనార్దన్ రెడ్డి పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను ఎగవేశారని.. కూతురి పెళ్లి కోసం గాలి దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు చేశారు..ఇంత ఘనంగా పెళ్లి జరిపించడానికి ఆయనకు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో, ఆయనకున్న ఆదాయ మార్గాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. ఇక ఈ ఫిర్యాదుతో పెళ్లి వేడుకపై దర్యాప్తు చేయడానికి ఐటీ శాఖ సిద్ధమయింది.