గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి అరెస్టు

 

మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ మీద పోటీ చేస్తున్న టీడీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్‌లో పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రతాప్ రెడ్డి డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. అయితే నిజానికి అరెస్టు చేయాల్సింది తనని కాదని, డబ్బు, మద్యం పంచుతూ ఓటర్లని ప్రభావితం చేస్తున కేసీఆర్నేనని ప్రతాప్ రెడ్డి అంటున్నారు. పోలీసులు కేసీఆర్‌కి అమ్ముడు పోయారని ప్రతాప్ రెడ్డి విమర్శిస్తున్నారు. ప్రతాప్ రెడ్డిని ఎన్నికలు పూర్తయ్యే వరకు హౌస్ అరెస్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించారు.