అత్యవసర సిబ్బందికి పూర్తి జీతాలు: జగన్

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవల సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. కోవిడ్‌ –19 నివారణకు ముమ్మర చర్యలు చేపడుతున్న వైద్య-ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తిగా జీతాలు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నివారణకు వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ... ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు తన నిర్ణయాన్ని జగన్ వెల్లడించారు.