ఐదు కిలోల బంగారు గాజులు.. అబ్బ!

 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నవారిని పట్టుకోవడం ఈమధ్యకాలంలో మామూలైపోయింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దాదాపు 20 కోట్ల విలువైన 62 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు భారీగానే బంగారాన్ని పట్టుకున్నారు. తాజాగా బుధవారం నాడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల నుంచి సుమారు ఐదు కిలోల బంగారు గాజులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తెచ్చిన మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.