ఏవోబీలో తుపాకుల మోత

 

ఏవోబీ సరిహద్దు ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది.పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.కిడారి, సోమ హత్యలంనంతరం ఒడిషా, ఏపీ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నిఘా పెంచారు.కూంబింగ్ చేస్తూ మావోల ఆచూకీ కొరకు మన్యాన్ని జల్లెడ పడుతున్నారు.తాజాగా మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగివాడ, పప్పులూరు అడవుల్లో మావోయిస్టులు క్యాంపు ఏర్పాటుచేసుకున్నారన్న సమాచారం మేరకు భద్రతాబలగాలు కూంబింగ్‌ చేపట్టాయి.కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.