తగ్గిన పెట్రోల్ ధర.. సామాన్యునికి కాస్త ఊరట

 

నిన్న మొన్నటి వరకు పెట్రోల్,డీజిల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ సామాన్యునికి చుక్కలు చూపించాయి.వీటి దారెక్కడ సెంచరీ కొడుతుందో అని అంతా ఆందోళన చెందారు,పెరిగిన ధరలపై సర్వత్రా నిరసన గళం వినిపించారు,కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఆందోళనలు చేపట్టారు.ఇన్నాళ్లుగా ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని మొండి ప‌ట్టు ప‌ట్టిన కేంద్రం.. మొత్తానికి దిగి వ‌చ్చింది.ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై సామాన్యుడికి రూ.2.5 మేర ఉపశమనం కల్పిస్తున్నట్టయింది.కాగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.5 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు జైట్లీ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.10,500 కోట్ల భారం పడనుందని జైట్లీ తెలిపారు.అయితే సామాన్యులకు మరో భయం పట్టుకుంది పైసల్లో తగ్గినప్పుడే పెరుగుదల రూపాయల్లో ఉంది అలాంటిది రూపాయల్లో తగ్గుతుందంటే మళ్లీ ఎంత పెరుగుతుందో అని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.