శంకర్రావ్ తో సిఎం భేటీ
posted on Mar 26, 2013 8:01AM
మాజీ మంత్రి శంకర్రావు గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారం, పోలీసులు తనపై చేసిన దౌర్జన్యాన్ని సోమవారం సభలో మాట్లాడేందుకు అనుమతించాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్ కు వెళ్లగా సభలో ఈ అంశాలు ప్రస్తావిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని స్పీకర్ శంకర్రావ్ కు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ హుటాహుటిన స్పీకర్ ఛాంబర్ కు వచ్చి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. అయితే శంకర్రావు గ్రీన్ ఫీల్డ్స్ భూముల వివాదంలో పోలీసులు తనపట్ల దురుసుగా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ వ్యవహారంపై సిఐడి విచారణ కొనసాగుతుందని వారంలోగా నివేదిక అందిన తరువాత తప్పనిసరిగా ఈ వ్యవహారంలో బాధ్యులైన వారపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారని తెలిసింది. అయితే శంకర్రావు మాత్రం ససేమిరా అంటూ ఈ అంశాన్ని సభలో ప్రస్తావించడానికి అనుమతించాలని, కావలసివస్తే తనను సస్పెండ్ చేయవచ్చని, పోలీసులు తనని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కు తరలించే సాక్షాలు టీ.వి. ఛానల్స్ ప్రసారం చేశారు ఇంకా సిఐడి విచారణ ఎందుకు అని ముఖ్యమంత్రిని నిలదీసినట్లు తెలిసింది.