జనసేన గూటికి టీటీడీ మాజీ చైర్మన్..!!

 

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీలో చేరికలు మొదలవుతున్నాయి.. ముఖ్యంగా తిరుపతిలో జనసేన పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇప్పటికే తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.. అయితే అలాంటిదేం లేదంటూ సుగుణమ్మ ఆ వార్తలను ఖండించారు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.. టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.. తాజాగా చదలవాడ హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ని కలిసినట్టు సమాచారం.. త్వరలోనే చదలవాడ జనసేన కండువా కప్పుకోనున్నారు.. చదలవాడ చేరికతో తిరుపతి రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ, వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు.. వెంకటరమణ మరణం అనంతరం ఆయన సతీమణి సుగుణమ్మ అదే స్థానం నుండి గెలుపొందారు.. ఇప్పుడు ఆమెనే ఎమ్మెల్యేగా ఉన్నారు.. చదలవాడ జనసేనలో చేరితే తిరుపతిలో త్రిముఖ పోటీ తప్పదు.. జనసేన ఇక్కడ గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరుపున చిరంజీవి కూడా ఇక్కడి నుండే విజయం సాధించారు.. మరి వచ్చే ఎన్నికల్లో ఈ త్రిముఖ పోరు ఎలా ఉంటుందో చూడాలి.