విశాఖ భూకుంభకోణంలో మాజీ మంత్రి

 

విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుంది. గత పదిహేనేళ్ల భూలావాదేవీలపై విచారణ జరిపిన సిట్‌.. 300 పేజీలతో ఇవాళ నివేదినకు ప్రభుత్వానికి ఇచ్చింది.  గతంలో విశాఖ జిల్లాలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్‌ కలెక్టర్లు, 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఈ నివేదికలో ఉండడం సంచలనంగా మారింది. మొత్తం 49 మంది ప్రభుత్వ అధికారులు, 50 మంది ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు తేల్చిన సిట్‌.. 1229 ఎకరాల ప్రభుత్వ భూమి, 751 ఎకరాల అసైన్డ్ భూమి, 109 ఎకరాల మాజీ సైనికులు భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు తెలిపింది.