ఫ్యాక్షనిస్ట్ల ఆస్తుల అటాచ్మెంట్
posted on Jul 10, 2013 12:06PM
దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫ్యాక్షనిస్ట్ల ఆస్తుల అటాచ్మెంట్కు రంగం సిద్దం అవుతుంది.. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి భారీగా నగదు చేతులు మారుతుందని భావించిన పోలీస్ యంత్రాంగం ఫ్యాక్షన్ ప్రబావిత ప్రాంతాలపై ప్రత్యేకం దృష్టి పెట్టింది.
ముఖ్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కె రఘురామిరెడ్డి అందుకు సంభందించిన ప్రణాలికను కూడా సిద్దం చేశారు.. అక్కడ జరగబోయే పంచాయతి ఎలక్షన్స్లో ఫ్యాక్షనిస్ట్ హావా తగ్గించి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించటం కోసం వాళ్ల అక్రమాస్థులపై దృష్టి పెట్టారు..
అందుకోసం ఇప్పటికే సిబి సిఐడి నివేదిక పంపిన ఎస్పి మనీ లాండరింగ్ యాక్ఠ్ కింద ఆదాయానికి మించి ఆస్తులు వున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. మరి ఎస్పి రఘురామి రెడ్డి చేయాలనుకుంటున్న ఈ అటాచ్మెంట్లు ఎంత వరకు సజావుగా సాగుతాయో చూడాలి..